కేటీఆర్ వల్లే ఐటీ పరిశ్రమలు పోతున్నయ్

కేటీఆర్ వల్లే ఐటీ పరిశ్రమలు పోతున్నయ్

అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటిఆర్ ఐటీ కంపెనీ ల పై అబద్ధాలు చెప్పిండన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. అబద్ధాలు ఆడడంలో కేటీఆర్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. ఐటీ ఇండస్ట్రీస్ పై అసెంబ్లీ లో కేటిఆర్ స్పీచ్ పై రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ..TRS ప్రభుత్వ వైఖరి కారణంగానే  తెలంగాణాలో ఉండలేమని హైదరబాద్ నుంచి చాలా IT సంస్థలు వెళ్ళిపోతున్నాయని తెలిపారు.నేను  చెప్పేది తప్పయితే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు ను నేలకు రాస్తా...కేటీఆర్ చర్చకు సిద్ధమా...అని సవాల్ విసిరారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి వెళ్లి పోతున్నయో లేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.

2007 YS రాజశేఖర్ రెడ్డి టైంలో మెదక్ జిల్లా తెల్లాపూర్ లో ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు TISH MEN స్పెయార్ అనే ఐటీ కంపెనీ  400 ఎకరాలను వేలం పాటలో 1686 కోట్లకు దక్కించుకుందని.. అడ్వాన్స్ కింద 400 కోట్లు కూడా చెల్లించిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ టైం లో కొన్ని రోజులు ఆగిన తర్వాత  2014 లో కేసీఆర్ ను కలిసి మెదక్ జిల్లా తెల్లాపూర్  400 ఎకరాల గురించి దరఖాస్తు చేసుకుందన్నారు. పరిశీలిస్తామని చెప్పిన కేసీఆర్ పట్టించుకోకపోవడంతో.. 2014 నుంచి తిరిగి తిరిగి 2021లో తెలంగాణ నుంచి TISH MEN స్పెయార్ అనే ఐటీ కంపెనీ వెళ్లిపోయిందన్నారు. ఇది నిజామో కాదో కేటీఆర్ చెప్పాలన్నారు రఘునందన్ రావు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు..న్యూ యార్క్ నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చిన TISH MEN స్పెయార్ ను  తండ్రి, కొడుకు పట్టించుకోలేదని విమర్శించారు.

సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ నిర్వాహకం వల్ల చాలా కంపెనీలు HYDERBAD నుంచి వెళ్లిపోతున్నాయని..లీగల్ సమస్య ఉన్న భూములను ఐటీ  పార్క్ లకు చూపిస్తున్నారన్నారు. లీగల్ సమస్యలు ఉన్నాయనీ.. వరెస్ట్ సిటీ అని ఐటీ కంపెనీ లు వెళ్లిపోతున్నాయని తెలిపారు. 5 ఏండ్లయిన లాండ్ సమస్య పరిష్కారం కాకపోవడంతో DLF కూడ వెళ్ళిపోయిందన్నారు. ఇది వాస్తవమా కాదా అనేది కేటీఆర్ చెప్పాలన్నారు.

ఉప్పల్, రామంతపూర్ ఐటీ  కంపెనీల వైపు కేటీఆర్ ఎందుకు వెళ్ళడం లేదు.? అని ప్రశ్నించారు రఘునందన్ రావు. కొంపల్లి లో ఐటీ పార్క్ పెడతాం అంటే కూడా అనుమతులు ఇవ్వటం లేదని తెలిపారు. జిల్లాల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు ఏమైంది? పేపర్లలో ఐటీ కంపెనీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా అన్ని అబద్ధాలు రాపిస్తున్నారన్న రఘునందన్ రావు.. అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పిండన్నారు. కేటీఆర్ చెప్పిన విషయాలు ప్రజలు నమ్మొద్దన్నారు.