ప్రధాని చాలా తెలివిగా మాట్లాడుతున్నారు

ప్రధాని చాలా తెలివిగా మాట్లాడుతున్నారు

ప్రధాని మోదీ తెలివిగా మాట్లాడుతున్నారన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్. ప్రతిపక్షాలు ఏజన్సీల పరువు తీస్తున్నారన్నారు. అయితే ఈరోజు ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తోందన్నారు సీఎం. భారతదేశంలో ఏం జరుగుతుందో, ఐటీ, ఈడీ, సీబీఐతో ఏం జరుగుతుందో అంతా చూస్తున్నారన్నారు. దేశంలో దాడులు ఎలా జరుగుతున్నాయో అన్న విషయం ప్రపంచం చూస్తోందన్నారు రాజస్థాన్ సీఎం.  ప్రధాని ఏం మాట్లాడిన ప్రజలు నమ్ముతారన్నారు. మనం నిజాన్ని సామాన్యుల వద్దకు తీసుకెళ్లాలన్నారు. అప్పుడే బీజేపీ బండారం బట్టబయలు అవుతుందన్నారు. నిజం బయటపడుతుందన్నారు. గాంధీ బాటలోనే తాము నడుస్తామన్నారు  రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ . 

హిందూత్వ, పోలరైజేషన్ పేరుతో తెలివిగా మాట్లాడి  బీజేపీ వాళ్లు గెలిచారని విమర్శించారు అశోక్ గెహ్లెట్. దేశంలో, యుపిలో కోవిడ్ ఎంజిఎంటి గురించి అందరికీ తెలుసునన్నారు. అయినప్పటికీ, బిజెపి తెలివిగా మాట్లాడటం వలన ప్రతిపక్షాలు వెనుకబడ్డాయన్నారు. ఇది ప్రజల ఆలోచనలను మార్చిందన్నారు. చివరికి సత్యమే గెలుస్తుందని తాను నమ్ముతున్నానన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.