మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: పెండింగ్లో ఉన్న 22ఏ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. మంగళవారం వల్లభ్నగర్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అప్లికేషన్ల క్లియరెన్స్ ను పరిశీలించారు. ఆన్లైన్ లో ఉన్న జీవోలతో వెరిఫై చేసి, పెండింగ్ అర్జీలను త్వరగా పరిష్కరించాలన్నారు. లింక్ డాక్యుమెంట్స్ తో వెరిఫికేషన్ చేయాలని, యూఎల్ పీ పెండింగ్అర్జీలపై ఫోకస్చేయాలని చెప్పారు.
ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని క్లియర్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి ఆర్డీవో శ్యాంప్రకాశ్, అల్వాల్ తహసీల్దార్రాములు తదితరులు పాల్గొన్నారు.
