కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైంది

కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైంది

కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరమైందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. సర్వీసెస్-ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలి కన్సల్టేషన్ OPD పోర్టల్ ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా రాజ్ నాథ్ ప్రారంభించారు. సెకండ్ వేవ్ లోనూ రక్షణ శాఖ సేవలందించిందని గుర్తు చేశారు. DRDO కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు రాజ్ నాథ్. ఢిల్లీ, లక్నో, వారణాసి సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ రెడ్డీస్ సహకారంతో 2-DG డ్రగ్ ప్రోడ్యూస్ చేస్తున్నామన్నారు. చాలా స్టేట్స్ నుంచి 2-DG  కోసం రిక్వెస్టులు వస్తున్నాయన్నారు. ఇవాళ పది వేల సాచెట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయన్నారు.