న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రిపెయిడ్ కస్టమర్లకు మరోసారి క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. పండుగల సీజన్ మొదలు కావడంతో కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మూడు ప్లాన్లకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. అయితే రీచార్జిని మై జియో యాప్ లేదా కంపెనీ వెబ్సైట్ నుంచి మాత్రమే చేసుకోవాలని షరతు పెట్టింది.
84 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ. 249, రూ. 555, రూ. 599 ప్లాన్లకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. రీచార్జి చేసుకున్న వెంటనే క్యాష్ బ్యాక్ మొత్తం సదరు ఖాతాదారు అకౌంట్కు క్రెడిట్ అవుతుంది. మళ్లీ రీచార్జి చేసుకునే సమయంలో ఆఫర్ మొత్తాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది.