
న్యూఢిల్లీ: కొన్ని రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్పై రూ.3.95 కోట్లు పెనాల్టీ విధించినట్టు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అప్పులు, అడ్వాన్సులు, -చట్టబద్ధమైన ఇతర పరిమితులు, ఎఫ్ఐల ద్వారా మోసాల వర్గీకరణ రిపోర్టింగ్కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నామని సెంట్రల్బ్యాంక్ తెలిపింది. రూల్స్ ఉల్లంఘన, కస్టమర్ సేవల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల కోటక్బ్యాంకుకు ఫైన్ వేశామని తెలిపింది.