- 2004 చరిత్ర పునరావృతమవుతుంది
- రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా
- బీజేపీ మేనిఫెస్టోపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: సంకల్ప పత్ర పేరుతో బీజేపీ రిలీజ్చేసిన ఎన్నికల మేనిఫెస్టోను ‘విఫలమైన బ్యాంకులో డ్రా చేసిన పోస్ట్ డేటెడ్ చెక్’ అని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో 20 ఏండ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని, ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టోపై ఆదివారం రేవంత్రెడ్డి ట్విట్టర్లో స్పందించారు.
2004లో షైన్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ, ఇప్పుడు 2024లో వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసింది. అప్పుడు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న కాషాయ పార్టీని సోనియాగాంధీ నేతృత్వంలో దేశ ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితి పునరావృతమవుతుంది. అప్పటి లాగే వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీని తిరస్కరించి, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ను గెలిపిస్తారు. అప్పుడే తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశగా చూస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.