ప్రూఫ్ చూపించకుంటే ఓటు గాయబ్...! ఉమ్మడి నల్గొండలో మ్యాపింగ్ కాని ఓటర్లు 4 లక్షల పైనే...!

ప్రూఫ్ చూపించకుంటే ఓటు గాయబ్...! ఉమ్మడి నల్గొండలో మ్యాపింగ్ కాని ఓటర్లు 4 లక్షల పైనే...!
  • ఇప్పటికే తొలగించిన ఓట్లు 25,048
  • దేవరకొండ, నకిరేకల్​లో పెరిగిన ఓటర్లు 

యాదాద్రి, వెలుగు :  స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ (సర్​)లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్లు పెద్ద సంఖ్యలో మ్యాపింగ్​ కాలేదు. వీరందరూ ఎన్నికల కమిషన్​ సూచించిన గుర్తింపు కార్డులను ఆధారంగా చూయించాల్సి ఉంటుంది. లేకపోతే  ఓటర్​ జాబితా నుంచి తొలగిస్తారు. స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ 2002లో జరిగింది. అప్పటి​ లిస్ట్​ ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 24,30,469 మంది ఓటర్లు ఉన్నారు. 2025లోప్రచురించిన లిస్ట్​ ప్రకారం ఓటర్ల సంఖ్య 30,09,496కుచేరింది. 

4,47,921 ఓటర్లు మ్యాపింగ్​ కాలే.. 

ఎన్నికల కమిషన్​ ఆదేశాల మేరకు సర్​ నిర్వహణలో భాగంగా ​ 2002, 2025 ఓటరు లిస్ట్​ను ఆఫీసర్లు మ్యాపింగ్​ చేశారు. ఈ ప్రకియలో 2002 లిస్ట్​లోని ఓటర్ల పేర్లు, ఓటర్​ ఐడీ నెంబర్​ ఉంటే దాని ప్రకారం, పోలింగ్​ స్టేషన్ నెంబర్​ ప్రకారం పోల్చి చూశారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30,09,496 ఓటర్లు ఉండగా చనిపోయిన 25,048 ఓటర్లను లిస్ట్​ నుంచి తొలగించారు. 

నకిరేకల్, దేవరకొండ నియోజకవర్గాల్లో తొలగించిన వారు పోనూ కొత్తగా 791 మంది చేరారు. దీంతో ఓటర్ల సంఖ్య 29,84,448 చేరింది. వీరిలో 4,47,921 ఓటర్లు మ్యాపింగ్​ కాలేదు. లిస్ట్​లో పేర్లు, అడ్రస్​ స్పెల్లింగ్​ మిస్టేక్​ ఓటర్లు 7,47,354 ఉన్నారు. 

ఏదైనా ప్రూఫ్​ చూపించాల్సిందే.. 

ఓటర్లు అందరికీ ఎన్యూమరేషన్​​ ఫారాలను అందించడానికి ఎన్నికల కమిషన్​ చర్యలు తీసుకుంటోంది. స్పెల్లింగ్​ మిస్టేక్​ ఉన్న ఓటర్లు సరిదిద్దుకునే అవకాశం ఉంది. మ్యాపింగ్​ కానీ ఓటర్లు మాత్రం ఎన్నికల కమిషన్​ సూచించిన 12 గుర్తింపు(ఆధార్​ మినహా) కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు సంబంధించిన ఆధారాలను సైతం చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఓటరు లిస్ట్​ నుంచి పేరు తొలగిస్తారు.