రైతులకు ఎక్స్ గ్రేషియా ఇస్తామంటే కేసీఆర్‌ను నమ్మేదెలా?

రైతులకు ఎక్స్ గ్రేషియా ఇస్తామంటే కేసీఆర్‌ను  నమ్మేదెలా?

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో  ప్రభుత్వం విఫలమైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమరవీరుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. NCRB నివేదిక ప్రకారం టీఆర్ఎస్ పాలనలో 7వేల 5వందల మంది రైతులు చనిపోయారన్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 40 వేల మంది రైతులు చనిపోయారన్నారు. వారి కుటుంబాలకు కూడా కేసీఆర్ సర్కార్ పరిహారం ఇవ్వలేదన్నారు రేవంత్. గ్రేటర్ హైదరాబాద్ లో వరదబాధిత కుటుంబాలకు పరిహారం ఇస్తామని తప్పించుకున్నారని విమర్శించారు. ఇవన్నీ చేయని కేసీఆర్.. అగ్రిచట్టాల ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఎక్స్ గ్రేషియా ఇస్తామంటే నమ్మేదెలా అని ప్రశ్నించారు రేవంత్.