హైటెక్ సిటీలో కుంగిన రోడ్డు..  భారీగా ట్రాఫిక్ జామ్

హైటెక్ సిటీలో కుంగిన రోడ్డు..  భారీగా ట్రాఫిక్ జామ్

మాదాపూర్, వెలుగు: నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైటెక్ ​సిటీ ప్రధాన రహదారి కుంగింది. ఐకియా నుంచి సైబర్​టవర్స్​ రూట్​లో సైబర్​ గేట్​వే ఎదురుగా ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం రోడ్డు  కుంగిపోయింది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం, ఐకియా నుంచి సైబర్​ టవర్స్​ ప్రధాన రహదారి కావడం, ఇదే సమయంలో రోడ్డుపై గుంత ఏర్పడటం కారణంగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది.

రోడ్డు మధ్యలో ఏర్పడిన గొయ్యి వద్ద సైబరాబాద్​ పోలీసుల బారికేడ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్​ రద్దీని నియంత్రించారు.  రోడ్డు పక్కనే ఉన్న అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పైప్​లైన్​ నుంచి మురుగునీరు లీకేజీ అవ్వడం వల్లే రోడ్డు కుంగిదని తెలుస్తోందని మాదాపూర్​ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కుంగిన రోడ్డుకు టీజీఐఐసీ అధికారులు రిపేర్లు చేపట్టారు.