హైదరాబాద్సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను గురువారం వేలం వేయనున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్(లాజిస్టిక్స్) ఇషాక్ బిన్ మహ్మద్ తెలిపారు. జేబీఎస్లోని లాజిస్టిక్ విభాగంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు వేలం ఉంటుందన్నారు. ప్రతి నెలా నిర్వహించే వేలంలో వస్తువులను 30 నుంచి 50 శాతం తక్కువకే అమ్ముతున్నారు. ఇందులో గృహోపకరణాలు, టీవీలు, మొబైల్స్ ఉన్నాయి.
