దిశ కమిషన్ విచారణకు హాజరైన సజ్జనార్

దిశ కమిషన్ విచారణకు హాజరైన సజ్జనార్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' కమిషన్ ముందు టీఎస్ ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ హాజరయ్యారు. దిశ హత్యాచారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్ కౌంటర్ చేసిన అంశంపై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇవాళ(సోమవారం) జరిగిన విచారణకు సజ్జనార్ తో పాటు క్లూస్ టీమ్ వెంకన్న కూడా హాజరయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో దొరికిన ఆధారాలపై కమిషన్ కు క్లూస్ టీమ్ వెంకన్న నివేదిక అందించారు. విచారణ సందర్భంగా... ఎన్ కౌంటర్ సమయంలో నిందితుల చేతిలో ఆయుధాలు ఉన్నాయి? ఉంటే వాటిపై వేలి ముద్రలను సేకరించారా? తదితర ప్రశ్నలను వెంకన్నకు కమిషన్ సంధించింది. ఘటనా స్థలం దగ్గర పంచనామా చేసిన రెవెన్యూ అధికారిని కూడా ప్రశ్నించింది. మరోవైపు 7వ తేదీన మరోసారి విచారణకు రావాలని సజ్జనార్ ను ఆదేశించింది. 

ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌కు కమిషన్‌ ఇప్పటికే సమన్లు జారీ చేసింది.