ఇంటర్ ఎగ్జామ్లో.. మారిన క్వశ్చన్ పేపర్

ఇంటర్ ఎగ్జామ్లో.. మారిన క్వశ్చన్ పేపర్
  • జడ్చర్లలో సంస్కృతం బదులుగా హిందీ ప్రశ్నాపత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్

జడ్చర్ల టౌన్​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో ఓ విద్యార్థికి సంస్కృతం పేపర్​ బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు. బుధవారం సెకండ్​ లాంగ్వేజ్​ పేపర్–2 హిందీ, తెలుగు, సంస్కృతం సబ్జెక్టులకు పరీక్ష జరిగింది. జడ్చర్లలోని శ్రీ చైతన్య కాలేజీలోని​ఎగ్జామ్​ సెంటర్​లో పొరపాటు జరిగింది. ఆ సెంటర్​లో ఎగ్జామ్​ రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థికి ఇన్విజిలేటర్  సంస్కృతం సబ్జెక్టుకు బదులుగా హిందీ ప్రశ్నాపత్రం అందించాడు.

దీంతో ఆ విద్యార్థి ప్రశ్నాపత్రం అర్థం కాక సెంటర్​లోనే ఉండిపోయాడు. పరీక్ష సమయం అయిపోయాక ఇంటికి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కాలేజీకి చేరుకొని సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని డీఐఈవో తెలిపారు.