ఢిల్లీలో షేజల్ నిరాహార దీక్ష

ఢిల్లీలో షేజల్ నిరాహార దీక్ష

చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు : బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు షేజల్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. సోమవారం ఆమె ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ప్రాంగణంలో దీక్ష ప్రారంభించారు. షేజల్ మాట్లాడుతూ.. తనను లైంగికంగా వేధించిన ఎమ్మెల్యే చిన్నయ్యపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆరిజిన్ డైరీ ప్లాంటు నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని చూపించి, తమ వద్ద రూ. 30 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు ఆరోపించారు. న్యాయం జరిగే వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు తాను నిరాహార దీక్ష కొనసాగిస్తానని షేజల్ పేర్కొన్నారు.