ఆదిలాబాద్ అడవుల్లో మనుబోతును చంపిన వేటగాళ్లు

ఆదిలాబాద్ అడవుల్లో  మనుబోతును చంపిన వేటగాళ్లు
  •     హైదరాబాద్  తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
  •     గ్రానైట్ వ్యాపారితో పాటు ముగ్గురు అరెస్ట్
  •     నిందితుల్లో తండ్రీకొడుకులు

శామీర్ పేట, వెలుగు: ఆదిలాబాద్​ అడవుల్లో మనుబోతును వేటాడి మాంసాన్ని తరలిస్తుండగా,  తండ్రీకొడుకులతో పాటు మరో వ్యక్తిని శామీర్​పేట్  పోలీసులు, ఎస్ వోటీ మల్కాజ్​గిరి–2- టీమ్​ అరెస్ట్  చేసింది. వారి వద్ద టెలిస్కోప్  అమర్చిన లైసెన్స్ డ్​ రైఫిల్, ఎయిర్​గన్, 88 రౌండ్ల మందు గుండు సామగ్రి, 70 కిలోల మనుబోతు మాంసం, కత్తి, ఆయుధ లైసెన్స్  బుక్, మహీంద్రా బొలెరో వెహికల్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్​ డీసీపీ రాంకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్​కు చెందిన గ్రానైట్  వ్యాపారి వేముల సునీల్  సల్మాన్  రాజ్, అతని కొడుకు అఖిల్, కూలీ కట్టా ఆదినారాయణతో కలిసి బొలెరో వెహికల్​లో ఆదిలాబాద్  అటవీ ప్రాంతానికి వెళ్లారు. టెలిస్కోపిక్  రైఫిల్​తో సునీల్  మనుబోతును కాల్చి చంపాడు. 

మాంసాన్ని యాప్రాల్​కు తరలిస్తుండగా, పక్కా సమాచారంతో శామీర్​పేట్  మండలం అంతాయిపల్లి గ్రామంలో పోలీసులు వెహికల్​ను అడ్డగించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-, ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.