ఆటోమొబైల్ షాపుల్లో అగ్నిప్రమాదం..రూ. 50 లక్షల ఆస్తి నష్టం

ఆటోమొబైల్ షాపుల్లో అగ్నిప్రమాదం..రూ. 50 లక్షల ఆస్తి నష్టం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండు ఆటోమొబైల్ షాపుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. షాపుల్లో  భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 50 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

శంషాబాద్ లోని  ఎమ్మార్వో కార్యాలయం ముందు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న రెండు ఆటోమొబైల్ షాపుల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  అందరు చూస్తుండగానే మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో షాపుల్లోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే  షాపుల్లో ఆయిల్. ప్లాస్టిక్ సామాగ్రి ఎక్కువగా ఉండటంతో భారీగా  మంటలు ఎగిసిపడుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.