
కుషీనగర్: ఉత్తరప్రదేశ్ నుంచి తొలిసారి పేలోడ్తో కూడిన మోడల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శనివారం యూపీలోని కుషీనగర్ జిల్లాలో ఇన్ స్పేస్, ఇస్రో సహకారంతో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ఇండియా సంస్థ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. 15 కిలోల బరువైన రాకెట్ చిన్న శాటిలైట్ను మోసుకెళ్లి,1.12 కిలోమీటర్ల ఎత్తులో విజయవంతంగా విడిచిపెట్టిందని ఇన్ స్పేస్ సంస్థ అధికారులు వెల్లడించారు. ఐదు మీటర్లు కిందికి వచ్చిన తర్వాత ప్యారాచూట్ విచ్చుకుందని, శాటిలైట్ సేఫ్గా కిందకు తిరిగి వచ్చిందని తెలిపారు.
అలాగే మోడల్ రాకెట్ కూడా 400 మీటర్ల దూరంలో సేఫ్ గా తిరిగి ల్యాండ్ అయిందన్నారు. కాగా, దేశంలో ప్రభుత్వయేతర అంతరిక్ష ప్రయోగాలను ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్ స్పేస్) పర్యవేక్షిస్తుంది.