సర్పంచ్ వేధిస్తున్నాడని కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం

 సర్పంచ్ వేధిస్తున్నాడని కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ కలెక్టరేట్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశారు. జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ కు చెందిన యాదగిరి.. ప్రజావాణిలో కలెక్టర్ కు తమ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఆర్గుల్ సర్పంచ్ తమ ప్లాటు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నాడన్నారు బాధితుడు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు యాదగిరి.