
- తెలంగాణలో చేపట్టిన వాతావరణ పునరుత్పాదక శక్తి మార్పులపై ప్రసంగించనున్న ఎంపీ
హైదరాబాద్, వెలుగు: లండన్ లో ఈ నెల 25న జరగనున్న గ్లోబల్ సౌత్ దేశాల సదస్సుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం బయలుదేరి వెళ్లనున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆహ్వానం మేరకు ఈ సమిట్ కు ఆయన హాజరుకానున్నారు.
2019లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ యూరప్ దేశాలల్లో గ్లోబల్, లోకల్ వాతావరణ పరిస్థితులకు నాయకత్వ వేదికగా మారి వాతావరణ లక్ష్యాలను పెంపొందించేందుకు దారి చూపుతోంది. తెలంగాణలో చేపట్టిన వాతావరణ పునరుత్పాదక శక్తి మార్పులు, భారత్లో వాతావరణ చర్యల విజయాలపై ఈ సదస్సులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగించనున్నారు.