బషీర్ బాగ్, వెలుగు: హైదరాబాద్లోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు , బీజేపీ నాయకుడు విక్రమ్ గౌడ్ దరఖాస్తు దాఖలు చేశారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ఆఫీసులో నల్లు ఇంద్రసేనారెడ్డికి విక్రమ్ గౌడ్ దరఖాస్తు అందజేశారు.
ప్రస్తుత గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై బీజేపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుండడంతో మళ్లీ అతనికి టికెట్ కేటాయించే విషయం ఆసక్తికరంగా మారింది.