వచ్చే ఏడాది మే నుంచి కాజీపేటలో ‘మెము కోచ్‌‌‌‌‌‌‌‌’ల ఉత్పత్తి : మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

 వచ్చే ఏడాది మే నుంచి కాజీపేటలో ‘మెము కోచ్‌‌‌‌‌‌‌‌’ల ఉత్పత్తి : మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై చర్చించిన 
  • కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌, కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: కాజీపేట రైల్‌‌‌‌‌‌‌‌ మ్యానుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎంయూ)లో మెయిన్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ మల్టీపుల్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌ (మెము) రైళ్లను ఉత్పత్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది మే నుంచి ఈ ఉత్పత్తి ప్రారంభం కానుందని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణకు సంబంధించిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌తో కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి భేటీ అయి, చర్చించారు. రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌కు ఆయన వివరించారు.

 2026 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నామని, మే 2026 నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌ఎంయూలో ఉత్పత్తి ప్రారంభం కానుందని కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో మెము రైళ్లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి చెప్పారన్నారు. 16 నుంచి 20 కోచ్‌‌‌‌‌‌‌‌లు ఈ మెము రైలులో ఉంటాయని తెలిపారు. ఈ ట్రైన్లు గ్రామీణ, సెమీ అర్బన్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలను అనుసంధానించడంతో పాటు పండుగల టైమ్‌‌లో ఫ్యాసింజర్లకు సౌకర్యవంతంగా ఉంటాయని ఆయన వివరించారన్నారు.