V6 News

తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

తెలంగాణ తల్లి  విగ్రహాల ఆవిష్కరణ

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్​జిల్లాల్లోని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణల కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.  హైదరాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అడిషనల్​క‌‌లెక్టర్ క‌‌దిర‌‌వ‌‌న్ ప‌‌ల‌‌ని ఆవిష్కరించారు. ఎస్సీ కార్పొరేష‌‌న్ ఈడీ రమేశ్ , జిల్లా స‌‌ర్వే ఆఫీసర్​శ్రీ‌‌రామ్‌‌, క‌‌లెక్టరేట్ ఇన్​చార్జి ఏఓ విజ‌‌య‌‌ల‌‌క్ష్మి పాల్గొన్నారు. 

వికారాబాద్​లో కలెక్టరేట్​లో కలెక్టర్​ ప్రతీక్​జైన్​ఆవిష్కరించగా ఎస్పీ స్నేహ మెహ్రా, అడిషనల్​ కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్ హాజరయ్యారు. రంగారెడ్డి కలెక్టరేట్​లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించగా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్ రాధిక గుప్తా ఆవిష్కరించారు.  – హైదరాబాద్ సిటీ/రంగారెడ్డి/మేడ్చల్​/వికారాబాద్​, వెలుగు