భువనగిరిలో గంజాయి పట్టివేత

భువనగిరిలో గంజాయి పట్టివేత

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.  పశ్చిమ బెంగాల్​ లోని మహబ్బత్​పూర్​కు చెందిన సనౌల్​ షేక్​ కొంతకాలంగా భువనగిరిలో ఉంటున్నాడు.  సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్​ అధికారులు  సనౌల్​ షేక్​ గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికాడు.

అతడి వద్ద 170 గ్రాముల గంజాయితో పాటు 2400 గ్రాముల  గుర్తు తెలియని మత్తు పదార్థం పట్టుబడింది. అతడిపై ఎన్​డీపీఎస్​   కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని ఎక్సైజ్​ ఎస్పీ విష్ణుమూర్తి తెలిపారు.