
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఎగ్జామ్స్ బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పేపర్–2 మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు పరీక్ష జరగ్గా 72.52శాతం మంది హాజరయ్యారు. మార్నింగ్ సెషన్ లో 53 పరీక్షా కేంద్రాల్లో 13,131 మందికి గాను 9,513 (72.45%) మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్ లో 54 పరీక్షా కేంద్రాల్లో 13,230 మందికి గాను 9,605 (72.6%) మంది అటెండ్ అయ్యారు.
అయితే, పేపర్–2లో తెలుగు సబ్జెక్టు తేలికగా ఉందని, కవి పరిచయాలు, ఆలయాలు, నది తీరాలపై క్వశ్చన్లు వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. సైకాలజీలో బేసిక్ క్వశ్చన్లు వచ్చాయని, విద్యాహక్కు చట్టం, జాతీయ పాఠ్యప్రణాళికపై ప్రశ్నలు వచ్చాయని పేర్కొన్నారు. ఇంగ్లీష్ గ్రామర్ టఫ్ గా ఉండగా, మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులో ప్రశ్నలు నార్మల్ గా ఉన్నాయని వివరించారు.