టీఆర్ఎస్ జెండాలను పీకేసిన కాంగ్రెస్ నేతలు

టీఆర్ఎస్ జెండాలను పీకేసిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్:  ఐ-మాక్స్ సర్కిల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాలను పీకేశారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ కట్టి... గులాబీ తోరణాలను తొలగించారు కార్యకర్తలు. ఆ తర్వాత... వాటిని హుస్సేన్ సాగర్ లో వేసేందుకు వెళ్తుండగా యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ శివసేనా రెడ్డి సహా.. ఇతర నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. జాతీయ కాంగ్రెస్ నాయకుల విగ్రహాల చుట్టూ టీఆర్ఎస్ నాయకులు జెండాలేంటని ప్రశ్నించారు శివసేనా.