శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై కారు బీభత్సం సృష్టించింది. పెద్ద అంబర్ పెట్ నుండి గచ్చిబౌలికి వెళ్తున్న కారు పెద్ద గోల్కొండ ఔటర్ పై  అదుపుతప్పి చెట్లకు నీళ్లు పోస్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల సమాచారం. 
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే శంషాబాద్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.