
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే క్రిప్టో కరెన్సీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. క్రిప్టో కరెన్సీని మన దేశంలో నిషేధించాలని 2019 లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ అభిప్రాయపడింది. కానీ, క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ అభిప్రాయంతోపాటు, మన దేశంలోని వ్యక్తులు, సంస్థలు పెట్టిన పెట్టుబడులనూ దృష్టిలో ఉంచుకుని కొన్ని పరిమితులతో క్రిప్టో కరెన్సీని అనుమతించాలనే నిర్ణయానికి తాజాగా ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రిప్టో కరెన్సీ బిల్లుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు తుది మెరుగులు దిద్దుతున్నారు. శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 29 న మొదలవనున్న విషయం తెలిసిందే. ఫాస్ట్ ట్రాక్ విధానంలో క్రిప్టో కరెన్సీ బిల్లుకు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.