టీపీసీసీ కార్యదర్శి సోమన్నగారి లక్ష్మి మృతి

టీపీసీసీ కార్యదర్శి సోమన్నగారి లక్ష్మి మృతి

మెదక్​(కొల్చారం): తెలంగాణా ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ (టీపీసీసీ) కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఆమెకు గుండెపోటు రాగా  హైదరాబాద్​ కూకట్​పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆమె చనిపోయినట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్​ సోకినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమెకు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి మృతి చెందారు. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన లక్ష్మీ రవిందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్​ నియోజకవర్గ స్థానంలో టీఆర్​ఎస్​ పార్టీ టికెట్​ ఆశించారు. పార్టీ టికెట్​ లభించకపోవడంతో బీఎస్పీ పార్టీ క్యాండిడేట్​గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆమె కాంగ్రెస్​ పార్టీలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న ఆమెకు కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం టీపీసీసీ కార్యదర్శి పదవి ఇచ్చింది. సోమన్నగారి లక్ష్మీ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొల్చారం మండల కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షులు మల్లేశ్​ గౌడ్ తదితరులు​ సంతాపం వ్యక్తం చేశారు.