తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మూడో విడతలో 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది క్యాండిడేట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. గెలిచిన అభ్యర్థుల పేర్లను వెంటనే ప్రకటిస్తారు
జిల్లాల వారీగా పోలింగ్ శాతం
- పెద్దపల్లి జిల్లా 82.34 శాతం
- ములుగు జిల్లాలో 82.56 శాతం
- రంగారెడ్డి జిల్లాలో 81.54 శాతం
- నిర్మల్ జిల్లాలో 82.02 శాతం
- ఆదిలాబాద్ జిల్లాలో 77.95 శాతం
- కుమ్రంబీమ్ జిల్లాలో 80.83 శాతం
- మంచిర్యాల జిల్లాలో 84.51 శాతం
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76.39 శాతం
- జగిత్యాల జిల్లాలో 77.83% పోలింగ్
- నారాయణపేట జిల్లాలో 80.12శాతం
- వనపర్తి జిల్లాలో 83.22 శాతం పోలింగ్
- మహాబూబ్ నగర్ జిల్లాలో 81.44 శాతం
- రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన మూడో విడత పంచాయతీ పోలింగ్
- ఒంటి గంటవరకు క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే అనుమతి
- పోలింగ్ కేంద్రాలు మూసి గేట్లు వేసిన అధికారులు
- మధ్యామ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగిసిన పోలింగ్...
- పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన గేట్లు మూసివేసిన అధికారులు
- నిర్ణీత సమయానికి ముందుగా వచ్చిన వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించిన అధికారులు
- మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని హై స్కూల్ లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణను పోలింగ్ బూతులను కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డిఓ మైపాల్ రెడ్డి, పరిశీలించారు.
- నల్గొండ జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రం చందంపేట మండలం కోరుట్ల గ్రామం పోలింగ్ కేంద్రాన్ని జోన్-6 డి.ఐ.జి యల్.ఎస్ చౌహన్ ఐపీఎస్ తో కలిసి బందోబస్తును పర్యవేక్షించారు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
- ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్న ఐజీ
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి (మం) బద్ధతండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.
- కాంగ్రెస్, బిఆర్ఎస్ వర్గీయుల మధ్య తీవ్ర గర్షణ. తోపులాట.
- ఇరు వర్గాలను చదరగొట్టిన పోలీసులు.
- దొంగ ఓటు వేస్తున్నాడని అనుమానంతో ఓ ఓటర్ని చితకబాదిన కాంగ్రెస్ అభ్యర్థి.
వికారాబాద్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం...
- పరిగి మండలం 59.66 శాతం
- దోమ మండలం 63.20 శాతం
- పూడూరు మండలం 49.07
- కులక్చర్ల మండలం 60.64
- చౌడాపూర్ మండలం 52.93
- మొత్తం 57.19 శాతం పోలింగ్ నమోదు
- ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడిపల్లి లో ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు
- స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ..
- అధికారుల బుజ్జగించి గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ..
- ఓటు వేసేందుకు బయలు దేరిన ఆదివాసీలు
పెద్దపల్లి జిల్లాలో ఉదయం 11గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
- పెద్దపల్లి మండలం 55.59%
- సుల్తానాబాద్ మండలం 62.12%
- ఓదెల మండలం 55.97%
- ఎలిగేడు మండలం 55.61%
- వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఖండించారు. పోలింగ్ బూత్ లో బీఆరెస్స్ కు చెందిన ఏజెంట్లు ఓటర్లను ప్రలోభ పెట్టింనదకు అడిగితే కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేశారన్నారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళే ముందు తమపై దాడి చేశారని తెలిపారు ఓడిపోతామనే భయంతో ఇవన్ని చేస్తున్నారని అన్నారు
-
ములుగు వాజేడు మండలంలో ఓటు హక్కు వినియోగించుకునెందుకు 17 కిలోమీటర్లు కాలి నడకన కిందకి నడుచుకుంటూ వచ్చిన పెనుగోలు గ్రామస్తులు.
- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి రాసపల్లి వంశీ వద్ద 28,500 రూపాయలను పట్టుకున్న పోలీసులు
- ఆదిలాబాద్ జిల్లాలో పదకోండు గంటల వరకు 54.45% పోలింగ్ శాతం నమోదు
- జగిత్యాల జిల్లాలో 11 గంటల వరకు 52.82 శాతం పోలింగ్
- వరంగల్ జిల్లాలో 58.65
- హనుమకొండ జిల్లా 54.40
- జనగామ జిల్లా 51.82
- ములుగు జిల్లా 60.64
- మహబూబాబాద్ జిల్లా 66.24
- భూపాలపల్లి జిల్లాలో 61.64
సూర్యాపేట జిల్లాలో 11.గంటల వరకు పోలింగ్ శాతం..
- చింతలపాలెం....64.93%
- గరిడేపల్లి....62.10%
- హుజూర్నగర్... 53.57%
- మఠంపల్లి...65.93%
- మేళ్లచెరువు...56.42%
- నేరేడుచర్ల...50.53%
- పాలకవీడు...61.69%
- నారాయణపేట జిల్లా లో ఉదయం 11 గంటల వరకు 46.80 శాతం పోలింగ్ నమోదు..
- యాదాద్రి భువనగిరి జిల్లా :మూటకొండూర్ మండలంలా లో 11గంటల వరకు 58.79 పోలింగ్ నమోదు
- చెన్నూరు నియోజకవర్గంలో ఉదయం 11 గంటల వరకు 62.38 శాతం పోలింగ్ నమోదైంది. చెన్నూరు మండలంలో 62.93 శాతం, భీమారం 62.18 శాతం, కోటపల్లి 67.70 శాతం, జైపూర్ 54.89 శాతం, మందమర్రిలో అత్యధికంగా 69.53 శాతం పోలింగ్ నమోదైంది...
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం,మహదేవపూర్,మహముత్తారం, మల్హర్ రావు మండలాల్లో 11 గంటల వరకు 61.64 శాతం పోలింగ్ నమోదు..
- కుమ్రంబీమ్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 62.38 శాతం నమోదు
వరంగల్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు
- వరంగల్ జిల్లాలో 58.65
- హనుమకొండ జిల్లా 54.40
- జనగామ జిల్లా 51.82
- ములుగు జిల్లా 60.64
- మహబూబాబాద్ జిల్లా 66.24
- భూపాలపల్లి జిల్లాలో 58.13
- ఖమ్మం జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 60.84 శాతం పోలింగ్ నమోదు
- కరీంనగర్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 55.65% పోలింగ్
- సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ లో పోలింగ్ బూతులను పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీ ఆర్ఎస్ కార్యకర్తలు ముకుమ్మడిగా దాడి చేశారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈర్యతో పాటు నాలుగురు కార్యకర్తల పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇరు వర్గాల తోపులాటలో బోరింగ్ తండాకు చెందిన భూక్య స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలు. కాంగ్రెస్ కార్యకర్తల రెండు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు బీఆర్ఎస్ లీడర్లు. ఘటన స్థలానికి సిఐ సూర్యప్రకాష్ చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన కాంగ్రెసు కార్యకర్తలను పంచాయతీ రాజ్ రూరల్ డెవలమెంట్ మెంబర్, కాంగ్రెసు.. పార్టీ నేత..చల్లా నారాయణరెడ్డి పరామర్శించారు.
- యాదాద్రి : అడ్డగుడూర్ మండలం ధర్మారం లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్..
- నిర్మల్ జిల్లా : ముధోల్ లోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల
- వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ లో ఉన్న ఏజంట్ లు గుర్తులు చెబుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు. దాడిలో సర్పంచ్ అభ్యర్థి రాములుకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- వనపర్తి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 23.30శాతం పోలింగ్ నమోదు
- నారాయణపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 12.73 శాతం పోలింగ్ నమోదు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదు
- ఖమ్మం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 37 శాతం పోలింగ్ నమోదు
- మహబూబ్ నగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 25.38 శాతం పోలింగ్ నమోదు
- జోగులాంబ గద్వాల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 28.32 శాతం పోలింగ్ నమోదు
- ఆలంపూర్ :29.00 శాతం
- ఉండవెళ్లి : 28.81 శాతం
- మాన పాడు: 23.73 శాతం
- ఇటిక్యాల : 26.81 శాతం
- ఎర్రవళ్లి : 33.16 శాతం
- మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత. రెండు వర్గాల మధ్య వాగ్వాదం. పోలింగ్ బూతుల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు. భారీగా పోలీసుల మోహరింపు. రెండు వర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు.
-
నాగర్ కర్నూలు జిల్లాలో ఉదయం 9 గంటల సమయానికి 25.70 శాతం పోలింగ్ నమోదు
- అచ్చంపేట... 27.45 శాతం
- అమ్రాబాద్...25.26 శాతం
- బల్మూర్... 22.04 శాతం
- లింగాల.. 27.16 శాతం
- ఉప్పునుంతల ...25.80 శాతం
- పదార....25.29 శాతం
- చారకోండ ....27.73 శాతం
- కరీంనగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 9 గంటల వరకు మండలాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.
- హుజురాబాద్ 20.37 శాతం పోలింగ్ నమోదు.
- జమ్మికుంట 15.62 శాతం పోలింగ్ నమోదు
- వీణవంక 20.06 శాతం పోలింగ్ నమోదు
- సైదాపూర్ 24.28 శాతం పోలింగ్ నమోదు
- ఇల్లందకుంటలో 22.58 శాతం పోలింగ్ నమోదు
- ఆదిలాబాద్ జిల్లాలో తోమ్మిది గంటల వరకు19.37% నమోదు
- నిర్మల్ జిల్లాలో 9 గంటల వరకు 29.98% నమోదు
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 18.60 శాతం పోలింగ్ నమోదు
- సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 24.35 శాతం పోలింగ్ నమోదు
- మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 24.89 శాతం పోలింగ్ నమోదు
- సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 26.75శాతం పోలింగ్ నమోదు
- ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 29 % దాటిన పోలింగ్
- మంచిర్యాల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం 27.15%
- రంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.58 శాతం పోలింగ్
- మంచిర్యాల జిల్లామందమర్రి మండలంలో 9 గంటల వరకు 34 శాతం పోలింగ్
-
పెద్దపల్లి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 22.50 శాతం
- ఎలిగేడు 22.56%
- ఓదెల 19.50 %
- పెద్దపల్లి 21.08 %
- సుల్తానాబాద్ 26.08%
-
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- కాటారం,మహదేవపూర్,మహముత్తారం, మల్హర్ రావు మండలాల్లో 9 గంటల వరకు
- 26.11 శాతం పోలింగ్ నమోదు.
-
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పోలింగ్ శాతం వివరాలు
- ధర్మపురి-20.33%
- వెల్గటూర్-26%
- ఎండపల్లి-22.1%
- గొల్లపల్లి-26.44%
- బుగ్గారం-20.26%
- పెగడపల్లి-19.19%
-
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 9 గంటల వరకు పోలింగ్ శాతం
- వరంగల్ జిల్లా : 22.26
- జనగామ జిల్లా 22.51%
- హనుమకొండ జిల్లా :21.22
- ములుగు జిల్లా: 20.96
- మహబూబాబాద్ జిల్లా: 24.32
- భూపాలపల్లి జిల్లా: 22.01
- కరీంనగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.66% పోలింగ్ నమోదు
- వరంగల్ నర్సంపేట మండలం లక్నపల్లిలో వినూత్నంగా పోలింగ్ కేంద్రం..
- ఓటర్లను ఆకట్టుకునేలా హరిత పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దిన అధికారులు
- ఆహ్లాదకరమైన, వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు..
- కొబ్బరి మట్టలు... అరిటాకు ల తో పందిరి.. మామిడి తోరణాలతో స్వాగతం
- ఎకో ఫ్రెండ్లీ గా నిలిచిన లక్నవరం పోలింగ్ కేంద్రం
- కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం రాస్పెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోమ్మెళ్ల రాజయ్య ఓటమి బయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రికి తరలింపు
- మహబూబ్నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం గ్రామపంచాయతీలు 563, ఏకగ్రీవం 52, ఎన్నికలు జరగని ప్రాంతాలు 7, మిగతా 504 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు ఓటర్లు.
- మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉత్సాహంగా క్యూ కట్టారు. అభ్యర్థులు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది..
- నిర్మల్ జిల్లా ముథోల్ సెగ్మెంట్ లోని భైంసా, కుభీర్, తానూరు, బాసర, ముథోల్ మండలాల్లో 124 జీపీల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచే గ్రామీణ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. క్యూ పద్ధతిలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో మూడవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి..7 గంటల నుండే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్లు.. అదిలాబాద్ జిల్లాలో బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరేడిగోండ, గుడిహత్నూర్, తలమడుగు మొత్తం 6 మండలాలలో ఏకగ్రీవం మినహా 120 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి
- పెద్దపల్లి జిల్లాలో తుది విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 243 గ్రామపంచాయతీలు, 2432వార్డులు ఉన్నాయి..
- కరీంనగర్ జమ్మికుంట మండలం కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుంటన్న స్థానికులు
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మూడు మండలాలకు మూడో విడత ఎన్నికలు 65 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయాన్నే పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్లకు ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్స్ ను చూపెడుతూ సీల్ వెశారు.
-
3,547 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్..
- మూడో విడత పోలింగ్ కోసం 36,483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,547 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. 4,502 మంది ఆర్వోలు, 77,618 మంది పోలింగ్సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు, 43,856 బ్యాలెట్ బాక్స్లను అందుబాటులో ఉంచారు. పోలింగ్కు 3 రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటా తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
