కోల్ ఇండియా సీఎండీగా సాయిరామ్

కోల్ ఇండియా సీఎండీగా సాయిరామ్

న్యూఢిల్లీ:  కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర్ గా సాయిరామ్ బాధ్యతలు స్వీకరించారు.  ఆయన గతంలో నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కు  నేతృత్వం వహించారు. పీఎం ప్రసాద్ రిటైర్​మెంట్ తర్వాత కంపెనీ​ అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహించగా, ఇప్పుడు సాయిరామ్ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.  సౌర విద్యుత్, క్లిష్టమైన ఖనిజాల సేకరణ, కోల్​ గ్యాసిఫికేషన్ రంగాల్లోకి కూడా సంస్థ విస్తరిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సాయిరామ్​ ఎన్ఐటీ రాయపూర్​లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివారు.