ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ విద్యా వైద్య విభాగం సంయుక్త కార్యనిర్వహణాధికారిణిగా ఉన్న సదా భార్గవిని బదిలీ చేసి ఏపీ సోషల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గా నియమించారు. అలాగే ఇంటర్ విద్యా శాఖ కమిషనర్గా శేషగిరి బాబు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ గా  వి.రామకృష్ణను, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా చామకురి శ్రీధర్ను బదిలీపై నియమించారు. ఐటీడీఏ సీతంపేట ప్రాజెక్టు అధికారిగా బి.నవ్యను బదిలీపై నియమిస్తూ ప్రభుత్వం తరపున సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.