తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై సోషల్ మీడియా వేదికగా తీన్మార్ మల్లన్న అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసున్నారంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ హైదరాబాద్ సీసీస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ వృత్తిని అడ్డుపెట్టుకొని యూట్యూబ్ అడ్డాగా సీఎం కేసీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కన్వీనర్ క్రిశాంక్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తనపై నమోదైన కేసుల నుండి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తీన్మార్ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా  తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేయాలని సైబర్ క్రైం ఏసీపీను కోరినట్లు తెలిపారు. ఇప్పటికైనా మల్లన్న తన వైఖరిని మార్చుకోకపోతే  క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసేందుకు కూడా వెనుకాడమని ఆయన హెచ్చరించారు.