వెధవన్నర వెధవ : రైల్లో మందు కొట్టి.. పక్క ప్రయాణికుడిపై మూత్రం పోశాడు

వెధవన్నర వెధవ : రైల్లో మందు కొట్టి.. పక్క ప్రయాణికుడిపై మూత్రం పోశాడు

పీకల దాకా తాగిన ఓ రైల్వే ప్రయాణికుడు ..తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. లోయర్ బెర్తులో పడుకున్న ఇద్దరు సీనియర్ సిటిజన్స్పై అప్పర్ బెర్తులో పడుకున్న ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లోని ఏసీ కోచ్లో చోటు చేసుకుంది. 

అక్టోబర్ 4వ తేదీ బుధవారం మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పూర్ నివాసి డాక్టర్ జిఎన్ ఖరే, అతని 60 ఏళ్ల భార్య ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీకి వెళ్తున్నారు.  B-3 కోచ్ లోని 57, 60 బెర్త్‌లలో  వీరు నిద్రిస్తున్నారు. అయితే  కుతుబ్ విహార్ నైరుతి ఢిల్లీకి చెందిన రితేష్ కూడా అదే కంపార్ట్‌మెంట్‌లోని సైడ్ లోయర్ బెర్త్‌పై ప్రయాణిస్తూ.. మహోబా నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్నాడు. రైలు ఝాన్సీ జంక్షణ్ కి చేరుకోబోతుండగా, మద్యం మత్తులో ఉన్న రితేష్ సీటులో నుంచి లేచి వృద్ధ దంపతులపై మూత్ర విసర్జన చేయడం ప్రారంభించాడు. ఏం చేస్తున్నావ్..ఆగు ఆగు అంటూ గట్టిగా అరిచినా..నిందితుడు అలాగే మూత్ర విసర్జన్ చేస్తూనే ఉన్నాడు. అనంతరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాధితుల ఫిర్యాదుతో బీ3 కోచ్లోకి వచ్చిన రైల్వే పోలీసులు..అతన్ని ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. అనంతరం బీ3 కోచ్లోని బాధిత బెర్తులను శానిటైజేషన్ చేయించారు.