పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్త టీజీటీడీసీ ఎండీగా వల్లూరు క్రాంతి బాధ్యతలు

పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్త  టీజీటీడీసీ ఎండీగా వల్లూరు క్రాంతి బాధ్యతలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తామని టీజీటీడీసీ ఎండీ వల్లూరు క్రాంతి తెలిపారు. సోమవారం హిమాయత్​నగర్ లోని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) కార్యాలయంలో ఆమె ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ.. పర్యాటక ప్రదేశాల్లో వసతుల కల్పనతోపాటు రాష్ట్ర సాంస్కృతిక, వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తామని చెప్పారు. 

రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, తెలియని పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని, ప్యాకేజీ టూర్లపై ఫోకస్​పెట్టనున్నట్టు పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, టీజీటీడీసీ చైర్మన్ పటేల్​రమేశ్​రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. ఈ సందర్భంగా క్రాంతికి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పర్యాటక రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించాలని కోరారు.