ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సీపీ సజ్జనార్

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సీపీ సజ్జనార్

సైబరాబాద్ మాజీ పోలీసు కమిషనర్‌ సీపీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ గా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌ భవన్‌లో శుక్రవారం సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. దిశ కేసులో సత్వర న్యాయం చేశారంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సజ్జనార్‌ను కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. మూడేళ్ల పాటు సైబరాబాద్‌ సీపీగా పని చేసి.. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009 లో దేశం లోనే సంచలనం సృష్టించిన దిశ కేసులో సజ్జనార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్‌ గతం లో సీఐడీ, ఇంటిలిజెన్స్‌ విభాగాలలో పనిచేశారు.