క్రీడల్లో గెలుపోటములు సహజమే

క్రీడల్లో గెలుపోటములు సహజమే

చిట్యాల, వెలుగు: క్రీడల్లో గెలుపోటములు సహజమేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ క్రీడలు ఆదివారం ముగిశాయి. క్రీడాకమిటీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అధ్యక్షతన ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు ముకిరాల మధు, వంశీ, కృష్ణ, గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.