గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య : కేటీఆర్

గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య : కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని పేర్కొన్నారు. వార్డు ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారించవచ్చని చెప్పారు. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. 

టీఎస్​పీఎస్సీ గురువారం గ్రూప్ 4 నోటిఫికేషన్​ విడుదల చేసింది. మొత్తం 25 డిపార్ట్​మెంట్లలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది.