ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏం చేయాలంటే..

ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏం చేయాలంటే..

రెండేళ్లుగా ఎంతో మంది డిప్రెసివ్​ మూడ్​లో ఉన్నారు. కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం అనుకునేలోపు ఒమిక్రాన్.. లాక్​డౌన్​ భయం మొదలైంది. మళ్లీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని ఆందోళన పడుతున్నారు.  ఈ పరిస్థితుల్లో మానసికంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నారు సైకియాట్రిస్ట్ ప్రవీణ్​ కుమార్​ చింతపంటి. 
ఫస్ట్​ వేవ్​ అయిపోయాక మెంటల్​గా కొంత కోలుకున్నారు. రిఫ్రెష్​ అయ్యారు. కొంచెం కాన్ఫిడెన్స్​ కూడా వచ్చింది.  కానీ అప్పుడు సెకండ్​​ వేవ్​ వస్తుందని తెలియదు. అంతా సర్దుకుని  క్లియర్​ అయిపోయిందనే అనుకున్నారు. కానీ సెకండ్​ వేవ్​ వచ్చింది. దాంతో ఒత్తిడి​ ఎక్కువై డిప్రెషన్ బారిన పడ్డారు చాలామంది. ఆ ఎఫెక్ట్​ ఫ్యామిలీ రిలేషన్స్, జాబ్స్​​ మీద క్లియర్​గా కనిపిస్తోంది. అందరూ బెటర్​ అవుతున్నారని అనుకున్నాం. కానీ... అలా లేదు. మెంటల్​గా స్టెబుల్ అవ్వడానికి  మరింత టైం కావాలి. ఇప్పుడు ఈ ఒమిక్రాన్​ టైంలో మరింత నిబ్బరంగా ఉండాలి.
ఆలోచనలు ఎలా ఉన్నాయి?
వ్యక్తిగతంగా చాలా మందిలో.. చాలా ఆలోచనలు ఉంటున్నాయి. ఉద్యోగం ఉంటుందా? లేదా? వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కంటిన్యూ అవుతుందా? జీతం సరిగా వస్తుందా? లేదా..  సగం జీతమే  వస్తే, ఖర్చులు, ఈఎమ్​ఐలు క్లియర్​ ఎలా అవుతాయి?  ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? ఇలాంటి ఆలోచనలు ఒకలాంటి డిప్రెషన్​కు దారితీస్తాయి.  జాబ్​ పోతే అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఈ రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొన్న ఇబ్బంది ఇదే. అందుకని వీలైనంత స్టెబుల్​గా ఉండేందుకు ట్రై చేయాలి.
పెద్ద ఇబ్బందులేంటి..?
జాబ్​ పోయినా, సగం జీతమే వస్తున్నా.. ఏమీ కానట్టే గొప్పలకు పోతారు కొందరు. ఇదో రకం ప్రాబ్లమ్. ఐటీ ఉద్యోగాల్లో శని, ఆది వారాలు  వీకెండ్​ పార్టీలు, దోస్తులు, దావత్​లు, కార్లు,  టూర్ల సంగతి తెలిసిందే. జీతం వచ్చినా, రాకున్నా.. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే వాటిని మిస్​ అవకూడదన్నట్టు ఉంటారు. ఈ లైఫ్​స్టయిల్​ మార్చుకోవాల్సి వచ్చేసరికి కష్టంగా అనిపిస్తుంది. లక్షల్లో ఉండే పిల్లల స్కూల్​ ఫీజులు, ఫ్లాట్​ ఈఎమ్ఐలూ తలకు మించిన భారం అవుతాయి. దాంతో ఫైనాన్షియల్​ టెన్షన్ పెరిగిపోతుంది. డబ్బులు రాకపోవడం ఒక ఎత్తు.. స్టేటస్​ కోల్పోవడం ఇంకో ఎత్తు. వీటి వల్ల మానసికంగా జరిగే సంఘర్షణ చాలా డిప్రెషన్​లోకి తోసేస్తుంది. ఇది మగవాళ్లకే కాదు, ఆడవాళ్లలోనూ ఉంది. అదెలాగంటే.. చాలామంది అమ్మాయిలు జాబ్​చేసి పేరెంట్స్​ను చూసుకుంటున్నారు. ఈ లాక్​డౌన్​ సిచ్యుయేషన్స్ వంటివి వాళ్లను కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయి.
ఒంటరితనం  వల్ల..
ఐసోలేషన్​లో ఉండటం వల్ల కూడా డిప్రెషన్​ బారిన పడతారు. ఇతర కారణాలు ఏవైనా తోడైతే సమస్య మరింత టఫ్​ అవుతుంది. ఇవన్నీ వ్యక్తిగతంగా ఎదురయ్యే ఇబ్బందులు. ఇక సొసైటీలో వచ్చే ఇబ్బందులు చెప్పాలంటే, కుటుంబ పరంగా ఎదురైన ఒత్తిళ్లు. ఈ పరిస్థితుల్లో  కొన్నిచోట్ల భార్యాభర్తలు కొట్టుకోవడం, సూసైడ్​ చేసుకోవడం వంటివి కూడా జరిగాయి. ఆ పరిస్థితులు ఈమధ్య కొంత బెటర్​ అయ్యాయి. 
పిల్లలపై  ప్రభావాలు..
పిల్లలకు కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుస్తుంటాయి. దానికి తగ్గట్టు లిమిటేషన్స్​ పెట్టుకోవడం వంటవి మెచ్యూరిటీతో చేస్తుంటారు. ఆన్​లైన్​లో చదవడానికి పడ్డ ఇబ్బందులు వంటివి వాళ్లలోనూ డిప్రెషన్​ను తీసుకొచ్చాయి. రిజల్ట్స్​ విషయంలో మెంటల్​ టెన్షన్​ పెట్టుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. చుట్టూరా ఒకేలాంటి ఒత్తిడితో ఉన్న​ వాతావరణం.. అంటే.. కరోనా, డెల్టా ప్లస్​, ఒమిక్రాన్​.. అనే వార్తలు వింటుంటే.. ఎవరిలోనైనా సరే డిప్రెషన్ లెవెల్స్​పెరిగిపోతుంటాయి. 
అవేర్​నెస్​ ఎఫెక్ట్​?
ప్రపంచవ్యాప్తంగా  ఇప్పుడున్న ఒమిక్రాన్​ వేరియెంట్​ వరకు కూడా.. ఏం జరుగుతుందన్న విషయాన్ని హెల్త్​ ఆర్గనైజేషన్స్​ క్లియర్​గా చెప్పలేకపోయాయి. గైడ్​లైన్స్​లో పర్ఫెక్షన్​​ లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. పలానా వ్యాక్సిన్​ వేసుకుంటే కరోనా భయం పోతుందన్న నమ్మకం ఎవరూ ఇవ్వలేక పోయారు. దానికి తోడు ‘అదలా.. ఇదిలా..’ అంటూ బోలెడు రూమర్స్.  వ్యాక్సిన్​ వేసుకుంటే చనిపోతారన్న వార్తలు పల్లెల్లో చాలా ప్రభావం చూపాయి. బలవంతంగా వ్యాక్సిన్​ వేయాల్సి వస్తోంది ఇప్పటికీ. కొన్నిచోట్ల మతపరమైన భావనలు వ్యాక్సిన్​కి అంటగట్టి దూరం పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. వీటి వల్ల చాలా నష్టం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వైరస్​ వల్ల మానసికంగా వీక్​ అవడం​ అనేది పెరిగింది.
సొసైటీ మారిందా?
ఈ రెండేళ్లలో మనుషుల్లో పాజిటివ్​నెస్​ పెరిగింది. ఉన్నదాంట్లో కొంత పక్కనున్నవాళ్లకు ఇవ్వడం.. సాయం చేసే స్వభావం వంటివి పెరిగాయి. బతుకులో కష్టాన్ని, సుఖాన్ని తెలుసుకుని నడవాలన్న ఆలోచన​ డెవలప్ అవుతోంది. ఈ నేచర్​ కూడా మెంటల్​ ఫిట్​నెస్​ను ఇస్తుంది. ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సాయం చేసినవాళ్లు ఉన్నారు. వాళ్లను చూసి ఇన్​స్పైర్​ అవుతున్నారు.. స్థాయిని మించి సాయం చేయడం చూస్తున్నాం. ఇలాంటివి సొసైటీకి అవసరం.
బిజీగా ఉండాలి
ఏదో ఒక పని కల్పించుకుని బిజీగా ఉండే  ప్రయత్నం చేయాలి. పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్​ చేయాలి. మానసిక ప్రశాంతత​కి ఇవన్నీ బాగా హెల్ప్​ చేస్తాయి. టైంకి తినాలి. కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఉండాలి. అలాగే వీట న్నింటితో పాటు.. సోషల్​ స్కిల్స్​ నేర్చుకోవాలి. కొత్త వర్క్​ ఏదన్నా నేర్చుకుంటే సెల్ఫ్​ కాన్ఫిడెన్స్​​ పెరుగుతుంది.  ఫైనాన్షియల్​ 
ప్లానింగ్​ చేసుకోవాలి. మనిషి ఆలోచన లను ఒత్తిడి లోకి నెట్టేసే రూమర్స్​పట్టించు కోకూడదు.
స్టూడెంట్స్​ కోసం..
స్టూడెంట్స్​ అకడమిక్​ 
ఇయర్​ పోయిందని ఆలోచించడం మానేయాలి. సాధించాల్సింది చాలా ఉందన్న కాన్సెప్ట్​తో ముందుకు పోవాలి. ఒక ఏడాది మిస్​ అయినంత మాత్రాన కాంపిటీటివ్​ ఎగ్జామ్స్​లో పూర్తిగా వెనకబడినట్టు కాదు. మనమే ఆగిపోలేదు. ప్రపంచం కూడా ఆగింది. అందుకని.. భయపడక్కర్లేదు. 
కొన్ని దేశాల్లో ‘గ్యాప్​ ఇయర్​’ తీసుకుని చదివే పిల్లలు కూడా ఉంటారు. 
ఆ టైంలో లైఫ్​స్కిల్స్​ డెవలప్​ చేసుకుంటారు.  అకడమిక్​గా మిస్​ అయినవి ఇంట్లో కూడా నెమ్మదిగా చదువుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఫ్లెక్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, యాక్టివ్​
 థింకింగ్​, పేషెన్స్​ వంటి ఇంటర్​ పర్సనల్​ స్కిల్స్​ పెంచుకుంటే లైఫ్​ బాగుంటుంది​.