జాబ్ ఫైనల్ చేస్తామని.. రూ. 40 వేలు కొట్టేశారు 

జాబ్ ఫైనల్ చేస్తామని.. రూ. 40 వేలు కొట్టేశారు 
  • జనగామ జిల్లాకు చెందిన మహిళను మోసగించిన సైబర్ ఫ్రాడ్స్ 

జనగామ, వెలుగు : కాంట్రాక్ట్ జాబ్​ఇప్పిస్తామని ఓ మహిళను నమ్మించి రూ. 40 వేలు కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల విడుదలైన ఎంల్ హెచ్​పీ నోటిఫికేషన్​చూసి జనగామ జిల్లాకు చెందిన ఓ మహిళ అప్లై చేసుకుంది. కొద్ది రోజుల కింద డీఎంహెచ్​ఓ ఆఫీస్​నోటీస్​బోర్డుపై ప్రొవిజినల్​లిస్ట్ పెట్టడడంతో పాటు ఆన్​లైన్ లోనూ అందుబాటులో ఉంచారు. కాగా.. ఆ మహిళకు సైబర్​ఫ్రాడ్స్ ఫోన్​చేసి.. మెరిట్​లిస్ట్​లో​మీ పేరు ఫైనల్​చేస్తున్నామని, అందుకు రూ. 2 లక్షలు ఆన్​లైన్​ట్రాన్స్​ఫర్​చేయాలని సూచించారు.

 అంత డబ్బు లేదని ఆమె చెప్పగా..  వెంటనే రూ. 20 వేలు ట్రాన్స్ ఫర్ చేసి.. మిగతావి తర్వాత ఇవ్వాలని చెప్పారు. దీంతో ఆమె మంగళవారం రూ. 40 వేలు పలుమార్లు  కాల్ చేసిన నంబర్ కు ట్రాన్స్​ఫర్​చేసింది. బుధవారం ఆమె జనగామ డీఎంహెచ్​ఓ ఆఫీస్​కు వెళ్లి జాబ్ పై అడగడంతో అసలు విషయం తెలిసింది. తాను మోసపోయానని అధికారులను అడిగితే.. తామేమి చేయలేమని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించగా బాధితురాలు వెళ్లిపోయింది. ఇన్ చార్జ్​డీఎంహెచ్​ఓ రవీందర్​గౌడ్​ మాట్లాడుతూ.. పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని, ఎవరూ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. సైబర్​నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని కోరారు.