V6 News

డ్రగ్స్ పై నిఘా పెట్టాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి

డ్రగ్స్ పై నిఘా పెట్టాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదాద్రి, వెలుగు: డ్రగ్స్​ రవాణా, విక్రయం, వినియోగంపై నిఘా పెట్టాలని యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి ఆదేశించారు. నార్కోటిక్స్​ కో ఆర్డినేషన్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. డ్రగ్స్​ అరికట్టడానికి అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

 యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నందున స్కూల్స్​, కాలేజీలతో పాటు వివిధ ఫ్యాక్టరీల వద్ద నిఘా వేయాలన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించి డ్రగ్స్​ వినియోగంతో కలిగే దుష్ర్పరిణామాలను వివరించాలని  ఆదేశించారు. ఎస్సీ ఆక్షాంక్ష్​ యాదవ్​, ఎక్సైజ్​ ఎస్పీ విష్ణుమూర్తి, ఆర్డీవో కృష్ణారెడ్డి, అడిషనల్​ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఈవో సత్యనారాయణ ఉన్నారు.