దేశంలో 10 కోట్ల మంది డ్రగ్స్ తీసుకుంటున్నరు : ఎంపీ లక్ష్మణ్

దేశంలో 10 కోట్ల మంది డ్రగ్స్ తీసుకుంటున్నరు : ఎంపీ లక్ష్మణ్
  •     ఎనిమిదేండ్లలో 70 శాతం పెరిగింది: రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంపై పెరుగుతోందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ల‌‌‌‌క్ష్మణ్ ఆందోళ‌‌‌‌న వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 100 మిలియన్ల(10 కోట్ల) మంది డ్రగ్స్​కు బానిసలయ్యారన్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో దేశంలో డ్రగ్స్ వాడకం 70 శాతం పెరిగిందని చెప్పారు. మంగ‌‌‌‌ళ‌‌‌‌వారం రాజ్యస‌‌‌‌భ‌‌‌‌లో జీరో అవ‌‌‌‌ర్‌‌‌‌లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. 

మాదక ద్రవ్యాల నివార‌‌‌‌ణ‌‌‌‌కు జాతీయ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ప‌‌‌‌టిష్టమైన చ‌‌‌‌ర్యలు తీసుకున్నప్పటికీ డ్రగ్స్ స్థాయి మరింత పెరిగిపోయింద‌‌‌‌న్నారు. ఇది దేశ యువత-, జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అందువల్ల ఈ అంశంపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

ఈ సమస్య కేవలం వైద్యపరమైనది కాదని, కౌమారదశలో ఉన్నవారిలో ఈ వ్యసనం  సర్వసాధారణంగా మారుతోందని లక్ష్మణ్ అన్నారు. డ్రగ్స్ కార‌‌‌‌ణంగా హింసాత్మక, ఆర్థిక నేరాల పెరిగిపోతోన్న దృష్ట్యా త‌‌‌‌గు చ‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌ని కోరారు. ముఖ్యంగా అధిక- ప్రమాదకర జిల్లాల్లో పునరావాస కేంద్రాలను విస్తరించాల‌‌‌‌న్నారు.