తెలంగాణలో 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

తెలంగాణలో 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

తెలంగాణ నుంచి 10 మంది అధికారలకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్‌ హోదా పొందిన వారిలో జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్‌, కోరం అశోక్‌రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్‌ నికోలస్  ఉన్నారు. రెవెన్యూ కోటాలో ఐదుగురికి.. నాన్ రెవెన్యూ కోటాలో మరో ఐదుగురికి పదోన్నతి లభించింది. జనవరిలో ఢిల్లీలో రాష్ట్ర అధికారులకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. 

మరోవైపు రాష్ట్రంలో మరో ఏడుగురు ఐపీఎస్ లను  బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్, సీఐడీ ఎస్సీగా ఆర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. పీసీఎస్‌గా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీష్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.