ఖాట్మండు: హమాస్ జరిపిన రాకెట్ దాడుల తో ఇజ్రాయెల్లో 10 మంది నేపాలీ స్టూడెంట్లు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. చనిపోయిన స్టూడెంట్లు నేపాల్లోని సుదూర్ పశ్చిమ్ యూనివర్సీటీకి చెందిన వారని జెరూసలెంలోని నేపాల్ ఎంబసీ తెలిపింది.
'లెర్న్ అండ్ ఎర్న్' కార్యక్రమంలో భాగంగా 265 మంది నేపాలీ విద్యార్థులు ఇజ్రాయెల్లో చదువుతున్నారని వివరించింది. మృతి చెందిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని.. గుర్తింపు ప్రాసెస్ పూర్తయిన వెంటనే డెడ్ బాడీలను నేపాల్కు తీసుకువస్తామని నేపాల్ ఎంబసీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్లో 4,500 మంది నేపాలీ పౌరులు ఉన్నారని పేర్కొంది. శనివారం ఇజ్రాయెల్పై హమాస్ అకస్మాత్తుగా వైమానిక దాడులను మొదలుపెట్టింది. ఈ దాడుల్లో ఇప్పటిదాకా వందలాది మంది మరణించారు.