రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బికనేర్ జిల్లాలోని శ్రీ దుంగార్‌గా సమీపంలో  నేషనల్ హైవే-11పై  బస్సు, ట్రక్కు  ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది  మృతి చెందగా దాదాపు 25 మందికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. హైవేపై ఉన్న బస్సు, ట్రక్కును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.