రేపు మంత్రులుగా ప్రమాణం చేసే 10 మంది వీళ్ళే..

రేపు మంత్రులుగా ప్రమాణం చేసే 10 మంది వీళ్ళే..

పంజాబ్ లో రేపు(శనివారం) సీఎం భగవంత్ మాన్  మంత్రివర్గం ఏర్పాటు కానుంది. చండీగడ్ లో ఉదయం 11 గంటలకు 10 మంది ఎమ్మెల్యేలు  పంజాబ్ సివిల్ సెక్రటేరియట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత మధ్యాహ్నం 12.50 గంటలకు ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశం కానుంది.

ఎమ్మెల్యేలు హర్పాల్ సింగ్ చీమా, డాక్టర్ బల్జీత్ కౌర్, హర్భజన్ సింగ్ ETO,డాక్టర్ విజయ్ సింగ్లా,  లాల్ చంద్ కటరుచక్, గుర్మీర్ సింగ్ మీట్ హైర్, కుల్దీప్ సింగ్ ధాలివాల్, లాల్జిత్ సింగ్ భుల్లర్, బ్రమ్ శంకర్ (జింపా), హర్జోత్ సింగ్ బైన్స్,   మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని  సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు.