పేద ముస్లింలకు బియ్యం పంపిణీ

పేద ముస్లింలకు బియ్యం పంపిణీ

కరకగూడెం, వెలుగు : రంజాన్​ పండగ సందర్భంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో సోమవారం ‘ప్రాణీక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు 10 క్వింటళ్ల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్​ సభ్యుడు షేక్​ సోంద్​పాషా మాట్లాడుతూ సమాజంలోని పేదలకు సాయం చేయడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంటుందన్నారు.

ప్రతి ఒక్కరూ రంజాన్ పండగను సంతోషంగా జరుపుకోవాలనే ప్రతి సంవత్సరం ఫౌండేషన్​ తరుఫున పేదలకు సాయం చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.