IND vs PAK: ఇండియా- పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. 10 సెకన్లకు 50 లక్షలు వసూలు!

IND vs PAK: ఇండియా- పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. 10 సెకన్లకు 50 లక్షలు వసూలు!

భారత్-పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. గత నెలలుగా దాయాదుల మధ్య సమరం చూడాలని ఎదురు చూసిన అభిమానులకు కిక్ ఇవ్వడానికి ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ చేరుకొని ప్రాక్టీస్ కూడా ప్రారంభించేసారు.

ఇక ఈ బ్లాక్ బస్టర్ మ్యాచుకు రికార్డ్ స్థాయిలో యాడ్ ఛార్జ్ రికార్డ్ స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కోసం టీవీలో స్పాట్ ధరలు 10 సెకన్లకు 50 లక్షలకు అమ్ముడవుతున్నాయి. డెలాయిట్ భాగస్వామి జెహిల్ థక్కర్ మాట్లాడుతూ.. 10 సెకనుల స్పాట్‌కు  15-30 లక్షల మధ్య ఖర్చవుతుంది. 2019తో పోలిస్తే ఇది 40% పెరిగిందని చెప్పుకొచ్చాడు. 

ALSO READ: హ్యాట్సాప్ సార్ : హాకీ కోసం క్లాసులు పెట్టండి.. పిల్లలతో ఆడించండి.. ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం
        
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు 48 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మెగా  టోర్నమెంట్ ప్రకటనల ద్వారా రూ. 2,500-3,000 కోట్లు రాబట్టవచ్చని మీడియా ప్లానర్ల అంచనా.  2019 వన్డే వరల్డ్ కప్ (1,350కోట్లు) తో పోలిస్తే 2023 వరల్డ్ కప్ ఎడిషన్‌కు ఇది రెట్టింపు. టోర్నమెంట్ భారత్ లో నిర్వహించనుడడం, మరోవైపు ఫెస్టివల్ సీజన్ కావడం భారత్ కి కలిసి వచ్చింది.