సీపీఆర్ తో పసిబిడ్డకు పునర్జన్మ

సీపీఆర్ తో పసిబిడ్డకు పునర్జన్మ

సీపీఆర్ తో చాలా మందికి పునర్జన్మ లభిస్తోంది. తాజాగా నారాయణపేట జిల్లాలో అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు 108 సిబ్బంది. మక్తల్ మండలం దాసర్ దొడ్డి గ్రామానికి చెందిన హరిత అనే మహిళ ఇంటిదగ్గరే మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా పుట్టిన బాబు ఇంతసేపటికీ ఏడవడం లేదని తల్లిదండ్రులు గమనించారు. దీంతో కంగారు పడిన హరిత భర్త 108 అంబులెన్స్ కు సమాచారం అందించాడు.

దీంతో వెంటనే స్పందిచిన సిబ్బంది గ్రామానికి చేరుకొని.. పసిబాబు గుండె ఆగిపోయిందని గుర్తించారు. వెంటనే ఆ బాలుడికి సీపీఆర్ చేశారు. సుమారు 30 నిమిషాల పాటు సీపీఆర్ చికిత్స చేయడంతో బాబు ఊపిరి పీల్చుకొని .. ఏడవడం మొదలు పెట్టాడు. సీపీఆర్ తో ఆ పాపకు పునర్జన్మ లభించింది. ఆ తర్వాత బాబుని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తమ బాబుకు సకాలంలో చికిత్స అందించిన 108 సిబ్బందిని తల్లిదండ్రులు, స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.