ఆటోని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. విద్యార్థి మృతి.. మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన

ఆటోని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. విద్యార్థి మృతి..   మహబూబ్ నగర్  జిల్లాలో ఘటన

హన్వాడ, వెలుగు: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఓ విద్యార్థి చనిపోగా, ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. హన్వాడ ఎస్సై వెంకటేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్  జిల్లా హన్వాడ మండలం బుద్దారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్  రామాంజనేయులు కొడుకు చరణ్(15)ను తన సొంత ఆటోలో ఎక్కించుకొని మహబూబ్​నగర్ కు బయలుదేరాడు. 

మార్గమధ్యలో ఇద్దరు మహిళలను ఆటోలో ఎక్కించుకున్నాడు. పరిగి వెళ్లే ఆర్టీసీ బస్సు చిన్నదర్పల్లి సమీపంలో ఆటోను ఢీకొనడంతో చరణ్  అక్కడికక్కడే చనిపోగా, ఇద్దరు మహిళలను గాయాలయ్యాయి. వారిని మహబూబ్ నగర్  గవర్నమెంట్  ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.