స్కూల్ మెట్ల పైనుంచి.. పడి విద్యార్థిని మృతి..షాద్ నగర్ లో విషాదం

స్కూల్ మెట్ల పైనుంచి.. పడి విద్యార్థిని మృతి..షాద్ నగర్ లో విషాదం

షాద్ నగర్, వెలుగు: ఓ విద్యార్థిని స్కూల్​మెట్ల పైనుంచి పడి మృతిచెందింది. షాద్​నగర్​కు చెందిన వర్ణిక(10) స్థానిక  ప్రైవేట్​ స్కూల్​లో   నాలుగో తరగతి చదువుతోంది. గురువారం స్కూల్​ కు వెళ్లిన ఆమె మెట్లు దిగుతూ పడిపోయింది. స్పృహ కోల్పోవడంతో  యాజమాన్యం హాస్పిటల్​కు తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.